- Advertisement -
ఆసిస్ గడ్డపై టీమిండియా కెప్టెన్, కోచ్ రవిశాస్త్రిలకు అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్కు వారిద్దరూ చేస్తున్న విశేష సేవలకు గుర్తింపునకు గాను ప్రతిష్ఠాత్మక సిడ్నీ క్రికెట్ గ్రౌండ్(ఎస్సీజీ) గౌరవ జీవితకాల సభ్యత్వం ఇచ్చింది. సభ్యత్వానికి సంబంధించిన అవార్డులను శుక్రవారం ప్రదానం చేశారు. ప్రపంచంలో గొప్ప మైదానాల్లో ఎస్సీజీ ఒకటి. ఇందులో ఇప్పటి వరకు దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా(వెస్టిండీస్)లు మాత్రమే గౌరవ సభ్యత్వం పొందారు.