గాయం కారణంగా టీమిండియా గబ్బర్ ప్రపంచకప్ నుంచి ఔట్ అయిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో కమిన్స్ బౌలింగ్లో గాయపడిన విషయం తెలిసిందే. అయితే తొలుత మూడు మ్యాచులకు దూరమంటూ వార్తలు వచ్చినప్పటికీ ప్రస్తుతం మొత్తం టోర్నీ నుంచే ధావన్ దూరమైనట్లు బీసీసీఐ అధికారికంగా తెలిపింది. దీంతో వెల్లిపోతున్నానంటూ బావోద్వేగ వీడియోను గబ్బర్ తన ట్విట్టర్లో షేర్ చేశారు.అతను పెట్టిన ఓ వీడ్కోలు పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
టోర్నీ నుంచి తను వెళ్లిపోతున్నానని చెప్పాడు. ప్రపంచకప్ లో ఆడటం లేదని చెప్పేందుకే తానెంతో బాధ పడుతున్నానని అన్నాడు. ఇప్పట్లో తాను ఆడటం సాధ్యం కాదని వైద్యులు స్పష్టం చేశారని చెప్పాడు. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్లి, కప్ ను సాధిస్తుందన్న నమ్మకం తనకుందన్నాడు. తాను గాయపడినప్పుడు మద్దతుగా నిలిచిన తోటి ఆటగాళ్లకు, ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు తెలిపాడు. ఫైనల్ మ్యాచ్ జరిగేలోగా తన గాయం మానబోదని చెప్పడం వల్లే తాను తిరిగి ఇండియాకు బయలుదేరినట్టు ధావన్ వ్యాఖ్యానించాడు. జై హింద్’అంటూ వీడియో షేర్ చేశాడు. ప్రస్తుతం ధావన్ షేర్ చేసిన వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. మైదానంలో గబ్బర్ ఆడే ఆటను, చేసే హడావుడిని మిస్ అవుతామని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.