Monday, May 6, 2024
- Advertisement -

ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియా…. ల‌క్ష్య‌ఛేద‌న‌లో త‌డ‌బాటు..

- Advertisement -

దక్షిణాఫ్రికాతో కేప్‌ టౌన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో 208 పరుగుల లక్ష్య ఛేదనకి దిగిన భారత్ జట్టు తడబడుతోంది. జట్టు స్కోరు 30 వద్దే వరుస ఓవర్లలో శిఖర్ ధావన్ (16), మురళీ విజయ్ (13) ఔటవగా.. అనంతరం వచ్చిన చతేశ్వర్ పుజారా (4), విరాట్ కోహ్లి (28), రోహిత్ శర్మ (10) నిరాశపరిచారు. దీంతో భారత్ జట్టు ప్రస్తుతం81/6తో పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. రాబాద్ బౌలింగ్‌లో పాండ్యా క్యాచ్ అవుట్ అయ్యాడు. చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి.

దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ గాయం కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం లేదు. దీంతో ముగ్గురు పేసర్లతోనే బరిలోకి దిగిన ఆ జట్టు క్రమం తప్పకుండా భారత్ వికెట్లని పడగొడుతోంది. ముఖ్యంగా ఫిలాండర్ మురళీ విజయ్, కోహ్లితో పాటు రోహిత్ శర్మ‌లను బోల్తా కొట్టించి మ్యాచ్‌ని మలుపుతిప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -