- Advertisement -
ఇండియాలో ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతాకాదు. ఒక్క సారైనా ఈ గేమ్ లో ఆడి తమ లక్కును పరీక్షించుకోవాలని ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం భారత క్రికెట్ లో ఉన్న చాలా మంది ఆటగాళ్లు ఇలా ఐపీఎల్ నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం.
ఈనెల 12, 13 తేదీలలో బెంగాల్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం జరుగనుంది. దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ వేలంలో పాల్గొనేందుకు ఇప్పటకే 1214 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. కాగా ఇందులో 590 మందిని బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసింది.
ఐపీఎల్ వేలంలో ఈ సారి పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ కూడా ఉన్నారు. ఆయన రూ.50 లక్షల కేటగిరీ కింద ఆయన పేరును నమోదు చేసుకున్నారు. 2018లో మనోజ్ తివారీని పంజాబ్ జట్టు కొనుగోలు చేసింది. ఆయన 2022 రంజీ ట్రోఫీకి కూడా ఎంపికయ్యారు.