- Advertisement -
ఇండియన్ ప్రీమియర్ లీగ్– 2022 (ఐపీఎల్)కు వేలానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే యేడాది ఫిబ్రవరి 7,8 తేదీలలో వేలంను బెంగళూరులో నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తున్నది.
కరోనా కొత్త వేరియంట్ వల్ల ఇండియాలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వేలాన్ని యూఏఈలో నిర్వహించనున్నారనే వార్తలను బీసీసీఐ ఖండించింది. బెంగళూరులోనే వేలం ఉంటుందని స్పష్టం చేసింది.
ఈసారి లక్నో , అహ్మదాబాద్ టీంలు కొత్తగా రానున్నాయి. దీంతో టీంల సంఖ్య 10 చేరనుంది. కొత్తగా రెండు టీంలు రావడంతో ఈసారి వేలం చాలా రిచ్గా మారే అవకాశం ఉంది. కాగా ఈసారి జరిగే ఐపీఎల్లో శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధవన్, కగిసో రబడ, అశ్విన్లను కోల్పోవడం చాలా బాధాకరమని ఢీల్లీ క్యాపిటల్ కోఓనర్ పాథ్ జిందాల్ అన్నారు.