రికార్డుల రారాజు భారత జట్టు కేప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డులు మరోసారి అరుదైన రికార్డు సాధించాడు. తాజాగా మరో అరుదైన రాకార్డును సాధించారు. కాన్ పూర్లో జరిగిన మూడో వన్డేలో విరాట్ సెంచరీ చేసిన విషయం తెలిసిందె. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలోకి మరో రికార్డు వచ్చి చేరింది.
సరి’చేసుకుంటూ, మరోపక్క కొత్త రికార్డులను సృష్టిస్తూ ముందుకు పోతున్న కోహ్లీ ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో మరో రెండు రికార్డులు నెలకొల్పాడు. అందులో ఒకటి అతి తక్కువ వన్డేల్లో 9 వేల పరుగులు సాధించిన రికార్డు కాగా, ఇంకోటి కెప్టెన్గా ఒకే ఏడాది ఆరు సెంచరీలు బాదిన రికార్డు.
నిన్నటి మ్యాచ్లో వన్డేల్లో 32వ శతకం నమోదు చేసిన కోహ్లీ అదే సమయంలో ఒకే ఇయర్లో కెప్టెన్గా ఆరు సెంచరీలు చేసిన రికార్డు నెలకొల్పాడు. అలాగే కెప్టెన్గా అత్యధిక సెంచరీలు సాధించిన మూడో క్రికెటర్గా తన పేరును రికార్డును సాధించాడు.
సారథిగా 93 ఇన్నింగ్స్లలో 20 సెంచరీలు చేసిన కోహ్లీ, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ తర్వాతి స్థానాల్లో నిలిచాడు. రికీపాంటింగ్ కెప్టెన్గా 41 సెంచరీలు చేయగా, గ్రేమ్ స్మిత్ 33 శతకాలు నమోదు చేశాడు. ఇప్పుడు వారి తర్వాతి స్థానంలో 20 సెంచరీలతో కోహ్లీ నిలిచాడు.