భారత మాజీ ఓపెనర్, డేరింగ్ బ్యాట్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి తన మాటలతో వార్తల్లో నిలిచాడు. ఈ సారి టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ని టార్గెట్ చేశాడు.విరాట్ తన పంథా మార్చుకోపోతే కెప్టెన్సీకే ప్రమాదం అని తేల్చేశాడు.కోహ్లి తప్పు చేసిన జట్టులో అడిగేవారు లేరని వీరేంద్ర సెహ్వాగ్ చేప్పుకోచ్చాడు.‘ప్రతిజట్టులో నాయకుడు చేస్తున్న పొరపాట్లను చెబుతూ ఉండే ఆటగాళ్లు నలుగురైదుగురు ఉంటారు. కానీ నేను మాత్రం భారత జట్టులో అలాంటి వాళ్లను ఇప్పటివరకూ చూడలేదు.
గ్రౌండ్, డ్రెసింగ్ రూమ్లో కోహ్లి తీసుకుంటున్న నిర్ణయాలను జట్టులోని ఏ ఒక్క ఆటగాడు వేలెత్తి చూపించడం లేద’ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇది ఇలాగే కొనసాగితే కోహ్లి కెప్టెన్సీకే ప్రమాదమ’ని హెచ్చరించాడు.ఓ చానెల్లో మాట్లాడుతూ ‘కోహ్లి తన లాగే వేగంగా ఇతర ఆటగాళ్ల నుంచి పరుగులు ఆశిస్తున్నాడు. ఇందులో తప్పేం లేదు. గతంలో సచిన్ తన కెప్టెన్సీలో ఇదే విధంగా ఎక్కువ పరుగులు చేయమని అడిగేవాడు. కోహ్లి ఒక్కడు ఆడితే విజయం రాదు అని కోహ్లి గ్రహించలని సెహ్వాగ్ విరాట్కు చురుకలు అటించాడు.