విరామంలేకుండా క్రికెట్ ఆడుతున్న కెప్టెన్ కోహ్లీకి టీమిండియా మనేజ్ మెంట్ విశ్రాంతిని కల్పించింది. న్యూజిలాండ్తో జరుతున్న ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఇప్పటికే మూడు వన్డేలు గెలిచి సిరీస్ను కౌవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దాంతో మిగితా రెండు వన్డేలు, టీ20 సిరీస్కు కోహ్లీ
ప్రస్తుతం విరుష్క జంట విహారయాత్రలో బీజీగా గడుపుతున్నారు. విరాట్ కోహ్లీ.. అనుష్కశర్మ.. వరల్డ్లోనే క్రేజీయస్ట్ సెలెబ్రటీ కపుల్. దాదాపు నాలుగేళ్ల ప్రేమాయణం అనంతరం విరాట్.. అనుష్కలు గతేడాది చివర్లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. కోహ్లీ ఆటతో …అనుష్కశర్మ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇద్దరూ కాస్త రిలాక్స్ అయ్యారు. క్రికెట్కు కాస్త ఫుల్స్టాప్ పెట్టిన కోహ్లీ.. అనుష్కతో కలిసి ప్రైవేట్ జెట్లో హాలీడేకు వెళ్లాడు. ఇద్దరూ కలిసి ఏకాంతంగా ఉన్న ఫొటోను కోహ్లీయే ట్విట్టర్లో షేర్ చేశాడు. పోస్ట్ చేయడంతో కొన్ని నిమిషాల్లోనే వేలాది లైక్స్ సొంతం చేసుకుంది.