ఇంగ్లండ్లో జరిగే వరల్డ్కప్ కోసం కోహ్లీ సేనను ఇటీవల బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. 15 మంది సభ్యులతో కూడిన బృందాన్ని సెలెక్టర్లు ప్రకటించారు. జట్టులో మొదటినుంచి పంత్, రాయుడు ఉంటారని అందరూ ఆశించారు. కాని అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ వారిని ఎంపిక చేయకుండా సెలక్సన్ కమిటీ షాక్ ఇచ్చింది. ఇద్దరికి జట్టులో స్థానం ఇవ్వలేదని తీవ్ర విమర్శలు వినిపించాయి. వారందరికీ ఆశ్చర్యపరుస్తూ పంత్.. అంబటి రాయుడులను ప్రత్యేక పద్ధతి ద్వారా జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
ఇద్దరి ప్లేయర్లను వరల్డ్ కప్ కోసం స్టాండ్బైగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వీరితో పాటు పేస్ బౌలర్ నవ్దీప్ సైని కూడా ఆ జాబితాలో ఉన్నాడు. మే 30వ తేదీన ప్రారంభం అయ్యే మెగా ఈవెంట్ కోసం ముగ్గురు ప్లేయర్లను బ్యాకప్ చేసినట్లు తెలుస్తోంది. జట్టులో ఎవరైనా గాయాలపాలయితే వారి స్థానంలో వీరిలో ఒకరు జట్టులో ఆడుతారని బీసీసీఐ అధికారి ఒకర తెలిపారు. దీపక్ చాహర్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్లు జట్టుకు అసిస్టెంట్లుగా నెట్ బౌలింగ్లో భారత జట్టుకు సహకరిస్తారని తెలిపింది బీసీసీఐ.