ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి భాజాపా కు మద్య దూరం రోజురోజుకీ పెరిగిపోతోంది.ఒకప్పుడు చక్రం తిప్పిన బాబుకు ఇప్పుడు అన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
దీనికి ప్రధాన కారనం జగన్ కంటే ముందుగానే మోడీని కలిసేందుకు చంద్రబాబు శతవిధాల ప్రయత్నించారు.కాని బాబుకు వపాయంట్మెంట్ దొరకలేదు. అయితే జగన్కు మోదీ అపాయంట్మెంట్ ఇవ్వడమేంటనేది చర్చనీయాంశంగా మారింది.
మే మొదటి వారంలో చంద్రబాబు మోదీ అపాయంట్మెంట్ కోసం కేంద్రమంత్రి ద్వారా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.ఈ షాక్ నుంచి తేరుకోకముందే జగన్కు మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడం, సుధీర్ఘంగా చర్చలు జరపడంతో చంద్రబాబు అండ్ టీం దిగ్బ్రాంతికి గురైంది. చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇవ్వని మోడీ… జగన్కు మాత్రం ప్రత్యేక అపాయింట్మెంట్ ఇవ్వడంతో వెంకయ్యనాయుడు సైతం షాక్కు గురయ్యారని ఆంగ్ల పత్రిక ఒకటి వెల్లడించింది.
{loadmodule mod_custom,Side Ad 1}
ఇప్పటి వరకు అన్నీ తానై ఏపీ వ్యవహారాలను నడిపించిన సీనియర్ మంత్రివెంకయ్యనాడు హవా తగ్గిందనే వార్తలు వెలువడుతున్నాయి. వెంకయ్యనాయుడు కూడా దీన్ని జీర్నించుకోలేక పోతున్నారు.అంతేకాదు ప్రధానిని కలిసి బయటకు వచ్చిన తర్వాత జగన్ బహిరంగంగానే చంద్రబాబుపై ప్రధానికి ఫిర్యాదు చేశానని అంత ధైర్యంగా చెప్పడంతో టీడీపీ శ్రేణులు ఆలోచనలో పడ్డారు. ఏడాది కాలంగా ప్రధాని మోడీ, చంద్రబాబుతో ముఖాముఖి చర్చలు జరపని అంశాన్ని పత్రిక గుర్తు చేసింది.
చంద్రబాబుకు మోడీ అపాయింట్మెంట్ ఇవ్వని అంశంపై ఒక సీనియర్ నేత తమ వద్ద స్పందించినట్టు ఆంగ్ల పత్రిక వెల్లడించింది. పరిణామాలు చూస్తుంటే ఢిల్లీలో పరిస్థితి టీడీపీకి ప్రతికూలంగా తయారవుతోందన్న ఆందోళనను సదరు నేత పత్రిక వద్ద వ్యక్తం చేశారట. అసలు బీజేపీ ఎత్తులు వ్యూహాలు ఏంటో అంతుచిక్కడం లేదని సదరు టీడీపీ నేత ఆందోళన వ్యక్తం చేశారట.
{loadmodule mod_custom,Side Ad 2}
ముందునుంచి బాబుమీద మోదీకి నమ్మకంలేదనేని వాస్తవమే. దీనికితోడు కేంద్రంలో చక్కంతిప్పుతున్న వెంకయ్యనాయుడుకూడా అపాయంట్మెంట్ ఇప్పించకపోవడం ఏంటనే చర్చ జరుగుతోంది.చూస్తుంటే చంద్రబాబుతో వెంకయ్య సంబంధాలను పసిగట్టిన బీజేపీ నాయకత్వం ఆయన ప్రాధాన్యతను తగ్గించేసిందా అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఏది ఏమైనామిత్రపక్షం..అందునా సీఎంకు మోదీ అపాయంట్మెంట్ దక్కకపోవడం చూస్తే భవిష్యత్తులో బాబు పరిస్థితి అగమ్యగోచరంగా తయారవడం కాయంగా కనిపిస్తోంది.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read