Wednesday, May 15, 2024
- Advertisement -

కార్ల‌పై ఎర్ర‌బుగ్గ‌ను వినియేగించ‌కుండా మార్గ‌ద‌ర్శ‌ కాలు జారీ చేసిన కేంద్రం

- Advertisement -
India bans red beacon lights from top of VIP cars

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ  తీసుకుంటున్న  నిర్ణ‌యాలు  దేశ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నం సృష్ఠిస్తున్నాయే అంద‌రికీ తెలిసింది. ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను కొందురు వ్య‌తిరేకిస్తున్నా దేశంలో సామాన్య ప్ర‌జానీకం మాత్రం మ‌ద్త‌తు ఇస్తున్నాయి.తాజాగా మోదీ మ‌రో సంచ‌ల‌న నిర్న‌యం తీసుకున్నారు. దేశంలో ప్రముఖులు ఎర్ర‌బుగ్గ కార్ల‌ను ఉప‌యేగించే వీఐపీకీ చ‌ర‌మ గీతం పాడారు.

వీవీఐపీలు, కేంద్ర మంత్రులు, కేబినెట్ హోదా కలిగిన నేతలు, ఉన్నతాధికారులు ఎర్ర బుగ్గలను వినియోగించరాదని తెలిపింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. నిబంధనల్లో మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో మే 1 నుంచి నూతన నిబంధనలు అమల్లోకి రానున్నట్లు చెప్పారు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ. ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండబోదన్నారు. 

నీలం బుగ్గల వినియోగంపై రాష్ట్రాలకు కూడా మార్గదర్శకాలు పంపనుంది కేంద్రం.  ఇందుకోసం మోటార్ వెహికిల్ యాక్ట్ నిబంధనల్లో కొన్ని మార్పులు చేయనున్నారు. వాటిపై నోటిఫికేషన్ విడుదల చేసి, మే 1 నుంచి నిబంధనలు అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. అయితే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి, లోక్‌ సభ స్పీకర్‌ మాత్రం ఎర్రబుగ్గ కార్లను ఉపయోగించే అవకాశముంది. ఐతే, ప్రధాని మోడీ స్వచ్ఛందంగా ఎర్రబుగ్గను ఉపయోగించకుండా దూరం ఉండే అవకాశముంది.అదే సమయంలో  ఒక్క  అత్యవసర సేవలైన పోలీస్, ఫైర్, ఆర్మీ, అంబులెన్సులు మాత్రం నీలం బల్బులను ఉపయోగించేందుకు అనుమతించారు.

కేంద్రం నిర్ణయంపై పలువురు నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, మహేష్ శర్మలు  వెంటనే తమ కారుకున్న బుగ్గను తొలగించారు. ఎంపీ గిరిరాజ్ సింగ్ కూడా ఎర్రబుగ్గను స్వయంగా తొలగించారు. ఇక గురువారం నుంచి ఎర్రబుగ్గ కారును ఉపయోగించకూడదని నిర్ణయించుకున్నారు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్.

వీవీఐపీ కల్చర్ కు పుల్ స్టాప్ పెట్టేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తొలి అడుగు వేశారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు, నేతలు ఎర్రబుగ్గ కారును వినియోగించకుండా నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పంజాబ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కెప్టెన్ అమరిందర్ సింగ్ కూడా మంత్రులు, ఉన్నతాధికారులు ఎర్రబుగ్గ కారును వినియోగించరాదని ఆదేశించారు. ఇక యూపీ సీఎం యోగి కూడా ఎర్రబుగ్గ కార్లను వినియోగించడం స్వచ్ఛందంగా నిలిపివేయాలని కోరారు. మొత్తంగా చూస్తే.. ప్రముఖల కార్లకు బుగ్గల తొలగింపు నిర్ణయం దేశ ప్రజల్ని అమితంగా ఆకర్షిస్తుందనటంలో సందేహం లేదు.

Related

  1. అద్వాని,ఉమాభార‌తిల‌కు సుప్రీం షాక్‌
  2. ట్రంప్ కొత్త ఆర్డ‌ర్‌పై క‌సంత‌కం దేశీయ ఐటి సంస్థ‌ల‌పై పెనుభారం
  3. జ‌గ‌న్‌ ను టార్గెట్ చేసి మాట్లాడితే.. వాళ్లు మాత్రం మేయిన్ పేజీలో ఉంటారు
  4. దిన‌క‌ర‌న్ అరెస్ట్‌కు రంగం సిద్ధం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -