తెలుగు వెండితెర దైవంగా భావించే ఎన్టీఆర్ జీవిత కథపై ఇప్పటికే చాలా కథలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ను రెండు పార్ట్లుగా తెరకెక్కించారు. కథానాయకుడు, మహనాయకుడు ఇలా రెండు పార్ట్లతో ఎన్టీఆర్ జీవితాన్ని సినిమాగా తీశారు. మొదటి పార్ట్ కథానాయకుడు సంక్రాంతి కానుకగా విడుదలై ఘోర పరాజయం పాలైంది. సినిమాలో ఏం బాలేదని ప్రేక్షకులు తెల్చేశారు. దీంతో రెండో పార్ట్ మహనాయకుడుపై ఒత్తిడి పెరిగింది. రెండో పార్ట్ను విడుదల చేయడంలో ఆలస్యం కావడంతో సినిమాపై అందరికి అనుమానాలు పెరిగాయి.
దీంతో సినిమా విడుదల తేదీని హడావిడిగా అనౌన్స్ చేశారు. మహనాయకుడును ఈ నెల 22న ప్రేక్షకుల ముందకు తీసుకురానున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను హడావిడిగానే విడుదల చేస్తున్నారు చిత్ర యూనిట్. ట్రైలర్ చూసిన ప్రతి ఒకరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొదటి పార్ట్ కథానాయకుడులో కూడా తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ అంత హీరో లేడని తెగ బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు రెండో పార్ట్ మహనాయకుడులో కూడా ఎన్టీఆర్ అంత గొప్ప నాయకుడు లేడని చూపించారని ట్రైలర్ను చూస్తుంటే అర్థం అవుతుంది. ఎన్టీఆర్ గొప్ప నాయకుడనడంలో ఎవరికి అనుమానాలు లేవు. కాని వాళ్ల డబ్బా వాళ్లే కొట్టుకుంటే ఎలా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్కు ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం లేదని చాలాసార్లు నిరుపించబడింది. ఎందుకంటే చికిత్స నిమిత్తం అమెరికాకు వెళ్లి తన పదవిని పొగొట్టుకున్న ఘనుడు ఎన్టీఆర్. తన ఎమ్మెల్యేలను అల్లుడు చంద్రబాబు కొనుగొలు చేసి వైశ్రాయ్ హోటల్లో పెట్టి మరి కాపాడుకున్నా సమయంలో కూడా ఎన్టీఆర్ ఏం చేయలేకపోయారు. ఇక తన పార్టీ వారే తనపై చెప్పులు విసిరిన ఏమి చేయలేక నిస్సహాయస్థితిలో ఉండిపోయారు.
కాని ఇవి ఏమి పట్టించుకోకుండా ఎన్టీఆర్ను గొప్ప రాజకీయ నాయకుడిగా ఎలా చూపించాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. ట్రైలర్లో మరో దారుణం ఏమిటంటే ఇందిరా గాంధీ ఎన్టీఆర్ ఫోటోకి దండం పెట్టడం. ఇందిరా గాంధీని దగ్గర నుంచి చూసిన వారు ఆమె ఒక నియంత అని అంటుంటారు. మరి అలాంటి ఆమె ఎన్టీఆర్కు దండం పెట్టినట్లు ట్రైలర్లో చూపించారు. ఇలా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం వల్లే మొదటి పార్ట్ అట్టర్ ఫ్లాప్ అయింది. రెండో పార్ట్లో కూడా ఇదే రిపీట్ చేశారు. మరి ఇది ఆడుతుందో చూడాలి.