ఎన్ఠీఆర్ జీవిత కథ ఆధారంగా ఆయన తనయుడు బాలకృష్ణ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవితాన్ని రెండు పార్ట్లుగా విభజించి తీయడం జరిగింది. మొదటి పార్ట్లో ఆయన సినీ జీవితానికి సంబంధించినది, రెండోది ఆయన రాజకీయానికి సంబంధించినదిగా తెరకెక్కింది. మొదటి పార్ట్ కథానయకుడు ఈ సంక్రాంతికి విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. దీంతో రెండో పార్ట్ మహనాయకుడుపై ఒత్తిడి పెరిగింది. కథానాయకుడు ఫ్లాప్ అవ్వడంతో సినిమాలో కొన్ని మార్పులు చేసి మరి విడుదల చేస్తున్నారు.
అయితే మొదటి పార్ట్ ఫ్లాప్ అవ్వడంతో రెండో పార్ట్పై ఎవ్వరికి పెద్ద నమ్మకం కలగడం లేదు. పైగా ఈ సినిమాలో ఎక్కువుగా నాదెండ్ల భాస్కరరావు గురించి ఉన్నట్లు ట్రైలర్ను చూస్తుంటే అనిపిస్తోంది. దీంతో పార్ట్పై ఎవరు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. పైగా సినిమాలో బాలయ్యను చూస్తుంటే ఎన్టీఆర్లా కనిపించడం లేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇది గ్రహించే అనుకుంటా సినిమాకు కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించలేదు బాలయ్య. మరి రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
- Advertisement -
సందడి లేని బాలయ్య ‘మహనాయకుడు’
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -