Saturday, April 27, 2024
- Advertisement -

వీధికెక్కడ‘మా’.. రాజేంద్రుడి నో

- Advertisement -

మూవీ ఆర్ట్‌ అసోసియేషన్‌లో నెలకొన్న విభేధాలపై స్పందించేందుకు సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ నిరాకరించారు. ‘మా’వివాదాలపై ఇప్పుడేం మాట్లాడలేనని, కాకపోతే ఆర్టిస్టుల సంఘం వీధికెక్కకుండా ఉంటే బావుండేదని అన్నారు. బయటకు వచ్చి గొడవలు పడితే ఎవరికి నష్టమని ప్రశ్నించారు.

చూసేవాళ్లకు సినిమా వాళ్ల గొడవలు ఇంట్రెస్ట్‌గానే ఉంటాయన్నారు. ‘మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌’ వాళ్లు వాళ్ల సమస్యను అసోసియేషన్‌ లోపలే పరిష్కరించుకుంటే మంచిదని సూచించారు. సమస్యలు వచ్చినప్పుడు హుందాగా ఎదుర్కోవాలని హితవు పలికారు. వివాదాలకు కారణమేంటో తనకు పూర్తిగా తెలీయదని, తాను కూడా కనుక్కోలేదన్నారు. ఒకవేళ తనకు అవకాశం ఇస్తే ఆ సమస్యలను పరిష్కరించడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు.

తన పిల్లలకు ఆసక్తి లేని కారణంగానే సినిమాల్లోకి రాజేంద్రప్రసాద్‌ వెల్లడించారు. ‘మా అబ్బాయిని ఇండస్ట్రీకి ఎందుకు తీసుకురాలేదని చాలామంది అడుగుతుంటారు. ఎవరో తీసుకొచ్చినంత మాత్రాన -ఇండస్ట్రీలో ఎవ్వరూ నిలబడలేరు. మనలోని ఆసక్తి ఇటువైపు నడిపించాలి. అదృష్టంకొద్దీ ఆ ఆసక్తి నా మనవరాలికి వచ్చింది. నా మనవరాలు ‘మహానటి’ సినిమాతో పరిచయం అయింది. ఆమె ఆసక్తికి తగిన ప్రోత్సాహం దక్కుతుండటం ఆనందంగా ఉంది’ అని రాజేంద్రప్రసాద్‌ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -