Friday, April 26, 2024
- Advertisement -

మళ్ళి పుకార్ల బారిన పడ్డ అడివి శేష్

- Advertisement -

అడివి శేష్.. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో దూసుకుపోతున్న నటుల్లో ఒకడు. క్షణం, గూఢచారి వంటి సినిమా ల తర్వాత ఈ నటుడు త్వరలో ఒక వైవిధ్యభరితమైన సినిమా తో మన ముందుకు రానున్నాడు. శేష్ ఎంతో ప్రతిష్టాత్మకం గా ఎవరు అనే ఒక కొత్త చిత్రం తో మన ముందుకు రానున్నాడు. క్షణం సినిమా ని నిర్మించిన పీవీపీ ఈ సినిమా కి కూడా నిర్మాత గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా ముగించేశారు దర్శక నిర్మాతలు.

ఇదే విషయాన్నీ శేష్ కూడా ధ్రువీకరించాడు. మీడియా అటెన్షన్ ఉండకూడదు అని సినిమా ని త్వరితగతిన పూర్తి చేసి ఇప్పుడు ప్రచారాన్ని ప్రారంభించాడు శేష్. అయితే ఈ సినిమా తో వెంకట్ అనే ఒక నూతన దర్శకుడు తెలుగు సినిమా పరిశ్రమ కి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా కి అబ్బూరి రవి సంభాషణలు రాయనున్నారు.

అయితే తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం శేష్ బాలీవుడ్ లో విడుదల అయ్యి విజయం సాధించిన ది ఇన్విజిబుల్ గెస్ట్ అనే సినిమా ని తెలుగు లో రీమేక్ చేసినట్లు తెలుస్తుంది. కానీ ఇదే సినిమా ని ఇంతకు ముందు తాప్సి అమితాబ్ ల తో బద్లా అనే పేరు తో హిందీ లో చేశారు. అయితే శేష్ విషయం చెప్పనప్పటికీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని చూసిన వారు అందరూ ఈ సినిమా కచ్చితంగా రీమేక్ అని చెప్తున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -