Friday, April 26, 2024
- Advertisement -

పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తున్న మ‌రో హీరో

- Advertisement -

త‌మిళ రాజాకీయాల్లో ఇప్ప‌టికే ప‌లువురు హీరోలు ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్‌, సూపర్‌స్టార్ రజినీకాంత్‌లు పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నారు.తాజాగా త‌మిళ రాజ‌కీయాల్లోకి మ‌రో హీరో ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. హీరో అజిత్ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఇది నిజ జీవితంలో కాద‌ట‌. అజిత్ కొత్తగా న‌టించే సినిమాలో రాజ‌కీయ నాయ‌కుడిగా న‌టించ‌బోతున్నార‌ట‌. దీంతో అజిత్ ఫ్యాన్స్ త‌మ అభిమాన హీరో కూడా రాజ‌కీయాల్లోకి రావాల‌ని విజ్ఞాప్తి చేస్తున్నారు. అయితే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చే అవ‌కాశం లేద‌ని, రాజకీయాలంటే నాకు ఇంట్రెస్ట్ లేద‌ని చెప్పి అభిమానుల ఆనందంపై నీళ్లు చ‌ల్లారు అజిత్‌.

ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయ‌ల‌కు సంబంధించిన సినిమా ఒక‌టి కూడా చేయ‌లేదు అజిత్. త‌న కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ పొలిటిక‌ల్ మూవీలో న‌టిస్తున్నాడు అజిత్‌. ఇటీవ‌లే విశ్వాసం సినిమాతో మ‌రో హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్న అజిత్ ప్ర‌స్తుతం బాలీవుడ్ పింగ్ రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు హెచ్.వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ ద‌ర్శ‌కుడు చెప్పిన పొలిటిక‌ల్ క‌థ అజిత్‌కు బాగా న‌చ్చ‌డంతో వెంట‌నే ఈ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట అజిత్‌.ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌నున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -