Friday, April 26, 2024
- Advertisement -

దిల్ రాజుకు నో చెప్పిన అక్కినేని హీరో

- Advertisement -

గత కొంతకాలంగా ఫ్లాప్ సినిమాలతో సతమతమైన అక్కినేని హీరో నాగ చైతన్య ఎట్టకేలకు సమంత హీరోయిన్ గా నటించిన ‘మజిలీ’ సినిమాతో మంచి హిట్ ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్ తో ముందుకు దూసుకుపోతున్న నాగచైతన్య ఇకపై స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం ‘వెంకీ మామ’ సినిమాతో బిజీగా ఉన్న నాగచైతన్య ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ‘ఫిదా’ బ్యూటీ సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే ఇప్పటికే ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి వంటి దర్శకులు నాగ చైతన్య కి కథలను వినిపించారు. కానీ రొటీన్ కమర్షియల్ సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్న నాగచైతన్య ఆ సినిమాలను రిజెక్ట్ చేశాడు. తాజాగా దిల్ రాజు క్యాంప్ నుంచి వచ్చిన ఒక ఆఫర్ కి కూడా నాగచైతన్య నో చెప్పినట్లు తెలుస్తోంది. శశి అనే కొత్త దర్శకుడు ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న ఒక సినిమా కథ నాగచైతన్యకి చెప్పాడట. కథ బాగానే అనిపించినప్పటికీ ఫైనల్ నెరేషన్ నచ్చకపోవడంతో నాగచైతన్య ఈ సినిమాని వద్దన్నట్టు ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా కథల విషయంలో చై లో ఖచ్చితంగా పెద్ద మార్పు వచ్చిందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -