Saturday, April 27, 2024
- Advertisement -

వంకాయ‌లు, బెండ‌కాయ‌లు, బీర‌కాయ‌లు అంటున్న స‌మంత‌…

- Advertisement -

రంగ‌స్థ‌లం సినిమాలో రామ‌ల‌క్ష్మిగా అద్భుత న‌ట‌న క‌న‌బ‌రిచిన స‌మంత తాజాగా చెన్నై రోడ్ల‌పై కూర‌గాయ‌లు అమ్మింది. స‌మంత ఏంది కూర‌గాయ‌లు అమ్మ‌డ‌మేంట‌ని ఆలోచిస్తున్నారా..? మీరు విన్న‌ది నిజ‌మే. సామాజిక కార్య‌క్ర‌మాల్లో స‌మంత చురుగ్గా పాల్గొంటార‌న్న సంగ‌తి తెలిసిందే.

అటు త‌మిళంలోనూ స‌మంత‌కు మంచి క్రేజ్ ఉంది. అక్క‌డ కూడాఅగ్ర‌హీరోల‌తో పనిచేస్తూ స్టార్ హీరోయిన్‌గా త‌న స‌త్తా చాటుతోంది. ఇంత‌కీ కూర‌గాయ‌లు ఎందుకు అమ్మింద‌నుకుంటున్నారా..! సొంతంగా ‘ప్రత్యూష ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి.. చిన్న పిల్లలకు మహిళలకు అండగా నిలుస్తోంది.

సమంత తాజాగా ‘ప్రత్యూష ఫౌండేషన్’ ఆధ్వర్యంలో జరిగిన సోషల్ ఆర్గనైజింగ్ కార్యక్రమంలో స్వయంగా కూరగాయలు అమ్మారు సమంత. ఈ మొత్తాన్ని మానసిక వికలాంగులుగా ఉన్న పిల్లలు, అనేక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న చిన్నారుల వైద్యానికి ఉపయోగించనున్నట్లు తెలిపారు సమంత. ఈ ఫోటోలను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. వైరల్ అవుతున్నాయి.

కాగా ఇటీవల వరదలతో కకావికలమైన కేరళ ప్రజలకు అండగా నిలిచింది ‘ప్రత్యూష ఫౌండేషన్’. వరదబాధితుల సహాయార్ధం సేకరించిన బియ్యం, వాటర్ బాటిల్స్, మెడిసిన్, పాలు, బిస్కెట్స్ తదితర వస్తు సామాగ్రిని కేరళ ప్రజలకు పంపించి ఉదారతను చాటుకున్నారు.

https://www.instagram.com/p/BnD_8e-HOLQ/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -