ఈ మద్య సెలబ్రెటీలు బుల్లితెరపై తమ సత్తా చాటుతూ వస్తున్నారు. బిగ్ బాస్ ద్వారా ఎన్టీఆర్, నాని తర్వాత రెండు సీజన్లకు హూస్ట్ గా కింగ్ నాగార్జున వ్యవహరించారు. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ కి మెగాస్టార్ చిరంజీవి హూస్ట్ గా వచ్చారు. నెం.1 యారీ అనే కార్యక్రమానికి రానా హూస్ట్ గా వ్యవహరించారు. వీరి బాటలోనే అక్కినేని వారి కోడలు, అందాల నటి సమంత తొలిసారిగా హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అదే ‘సామ్ జామ్’. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల అయినపుడు అందరి అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
కాకపోతే టీవీ చానెల్స్ లో ప్రసారం కాకపోవడం, కేవలం ఓటీటీ ప్లాట్ ఫామ్ గా ఉన్న ‘ఆహా’లో మాత్రమే విడుదల అవుతుండటంతో దీనికి వీక్షకుల నుంచి అతి తక్కువ స్పందన వచ్చినట్టు సమాచారం. ఇక లాభం లేదని అనుకున్నన్ని ఎపిసోడ్లు కాకుండా, ముందుగానే ముగించేశారు. చివరి సీజన్ లో సమంత భర్త నాగ చైతన్య ఇంటర్వ్యూ వచ్చింది.
అంతకుముందు అల్లు అర్జున్ తో వచ్చిన ఎపిసోడ్ సైతం తీవ్ర నిరాశ పరిచిందని రేటింగ్స్ తెలుపుతున్నాయి. ఈ కార్యక్రమం తెలుగు సినీ, టీవీ ప్రేక్షకులను అలరించలేదని సినీ విశ్లేషకులు అంటున్నట్లు సమాచారం.
టాలీవుడ్ లో వీరి జోడీ సూపర్ హిట్..!
మహేశ్బాబు అభిమాన సంఘం అధ్యక్షుడిగా నాగ చైతన్య!
ఆ హీరోతో నటించేందుకు రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్న సాయి పల్లవి