Friday, April 26, 2024
- Advertisement -

ఇంట్లో ఉండలేనన్న అనసూయ.. ఫైర్ అయిన నెటిజన్లు..!

- Advertisement -

సోషల్ మీడియాలో పలు రకాలుగా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న వారిపై అనసూయ సీరియస్ అయింది. వారిని బ్లాక్ చేస్తున్నట్లు తెలిపింది. ‘నిన్నటి నుంచి ట్విట్టర్‌, ఇన్‌స్టాల్లో కొందరి ఖాతాలు బ్లాక్‌ చేసీ చేసీ వేళ్లు నొప్పి పెడుతున్నాయంటే నమ్మండి.. తప్పదు కదా? నా పేజ్‌లో వాళ్ల బుర్రలేనితనం ఏంటీ? నా శాంతి నా బాధ్యత’ అని తెలిపింది.

‘నన్ను అర్థం చేసుకోని వాళ్లని నేను అర్థం చేసుకోని వారిని సాయం చేస్తున్నాను.. ఎలాగంటే వారిని దూరంగా ఉంచుతున్నాను’ అని అనసూయ చెప్పింది. ‘అయ్య బాబోయ్!! ఏంటీ ఇంతమందా? ఇంత మంది బుర్రలేని వాళ్లా? ఇంత మంది వితండవాదులా? ఏం చేస్తాం లేండీ’ అని అనసూయ పేర్కొంది. ఇక కరోనా విస్తరణను కట్టడి చేసేందుకు రాష్ట్రంలో మార్చి 31 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ కు అనసూయ ఓ విన్నపం చేశారు.

‘సార్… ప్రభుత్వం చెప్పింది పాటించాలి. కానీ, కొన్ని ప్రొఫెషన్స్ విషయంలో మాత్రం కొన్న సడలింపులు ఉండాలి. మేము పనికి వెళ్లకపోతే… మాకు ఆదాయం రాదు. ఇంటి అద్దె, కరెంట్ బిల్లులు, ఈఎంఐలు మొదలైన వాటిని చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి మాలాంటి వారి ఇబ్బందులను కూడా పట్టించుకోండి’ అని ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ పై కొందరు అనసూయపై ఫైర్ అవుతున్నారు. బయటకు వెళ్తే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. అయినా నీకు ఏం సమస్య వచ్చింది. ఇన్నాళ్ళు రెండు చేతుల సంపాధించావు కదా.. ఒక పది రోజులు ఇంట్లో ఉండలేవా అంటూ నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -