Saturday, April 27, 2024
- Advertisement -

విజయ్ ను తిట్టింది.. ఇప్పుడు కావలంటున్న అనసూయ..!

- Advertisement -

విజయ్ దేవరకొండను హీరోని చేసింది పెళ్లి చూపులు సినిమా అయినప్పటికి.. స్టార్ ని చేసింది మాత్రం అర్జున్ రెడ్డి. ఈ సినిమా ఎవరు ఊహించని రెంజ్ లో హిట్ అయింది. అయితే ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అదే రెంజ్ లో విమర్శలను ఎదుర్కొంది. ఈ సినిమాలో వాడిన కొన్ని బూతు పదాలపై అప్పట్లో బానే చర్చాయింది. ట్రైలర్ పైనే విమర్శలు ఎదుర్కున్న ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ విమర్శలు మరింత ఎక్కువైయ్యాయి.

అయితే ఈ సినిమా విమర్శించిన వారిలో యాంకర్ అనసూయ ముందు వరసలో ఉంటారు. సోషల్ మీడియా వేధికగా ఈ సినిమాపై తీవ్రమైన విమర్శలు చేసింది. డిబేట్స్ లోకూడా ఈ సినిమాని చీల్చి చెండాడింది. దాంతో అనసూయను విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేశారు. తనను హీరోని చేసిన తరుణ్ బాస్కర్ ను మెయిన్ రోల్ గా పెట్టి ’మీకు మాత్రమే చెప్తా’ అనే సినిమాని నిర్మించాడు విజయ్ దేవరకొండ. అయితే అర్జున్ రెడ్డి టైంలో ఆ సినిమాపై దుమ్మెత్తి పోసిన అనసూయ.. ఇప్పుడు మీకు మాత్రమే చెప్తా అనే సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.

అర్జున్ రెడ్డి సినిమాని ఓ రెంజ్ లో ఆడుకున్న అనసూయకు విజయ్ తన సినిమాలో ఎలా ఛాన్స్ ఇచ్చాడని విజయ్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. త్వరలోనే రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు కానున్నాయి. అనసూయ కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. మరి ఆమెని ఇంటర్వ్యూ చేసేవాళ్లు ఫస్ట్ అడిగే ప్రశ్న.. మీరు విజయ్ ని విమర్శించారు కదా.. ఇప్పుడు అతను నిర్మించిన సినిమాలో ఎలా నటించారు’ అని. మరి దీనికి అనసూయ ఎలా జవాబు ఇస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -