Saturday, April 27, 2024
- Advertisement -

చాలా కాలం తర్వాత పోలీస్ గెటప్ లో బాలయ్య

- Advertisement -

వరుస డిజాస్టర్ లతో సతమతమైన డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ మధ్యనే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మళ్లీ ఫామ్లోకి వచ్చారు. రామ్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ ఎలాంటి సినిమా చేయబోతున్నారు అనే విషయం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ పనులతో పూరి జగన్నాథ్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ సినిమా పూర్తయిన తర్వాత పూరి జగన్నాథ్ నందమూరి బాలకృష్ణ తో ఒక సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అంతకు ముందు బాలయ్య పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘పైసా వసూల్’ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాతో బాలయ్య కి మళ్ళీ ఒక మంచి హిట్ ఇవ్వాలని పూరి జగన్నాథ్ ఆశిస్తున్నారట. ఈ నేపథ్యంలో బాలయ్య కోసం పూరి ఒక మంచి కథను రాసుకున్న ట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు అని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ప్రస్తుతం కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేసి ఆ తర్వాత పూరి జగన్నాథ్ సినిమాని సెట్స్ పైకి తీసుకు వెళ్ళనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -