బిగ్బాస్ నుండి హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వారిని రీఎంట్రీ ఇచ్చేందుకు ఓ అవకాశం కల్పించాది బిగ్ బాస్ టీం.దీనికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియను గతవారం మొదలు పెట్టారు.హోస్ నుండి వెళ్లి పోయిన వారిని వెనక్కి తీసుకువచ్చే అవకాశం రావడంతో చాలామంది ఆనందపడ్డారు.తమకు ఇష్టమైన కంటెస్ట్ని హోస్లోకి పంపిచాలని భావించిన చాలామంది ,తమ అభిమానాన్ని ఓట్లు రూపంలో చూపించారు.బిగ్ బాస్ చరిత్రలోనే ఇప్పటి వరకు రాని ఓట్లు వచ్చాయాని నాని ఆదివారం ఎపిసోడ్లో వెల్లండించారు.
ఇక ఇప్పటి వరకు హోస్ నుండి సంజనా,నూతన నాయుడు,కిరీటి,శ్యామలా,భాను శ్రీ,తేజస్వీ బయటికి వెళ్లారు.వీరిలో ఎవరో ఒకరికి హోస్లోకి తిరిగి వచ్చే అవకాశం కల్పించారు బిగ్ బాస్ టీం.అయితే వీరిందరిలోను స్ట్రాంగ్ కనిపించింది ఇద్దరే.ఒకరు శ్యామల మరోకరు తేజస్వీ.వీరిద్దరి మధ్యే పోటీ ఉంటుందని అందరు ఊహించారు.కాని ఈ రేసులోకి నేనున్నాను అంటు దూసుకువచ్చాడు నూతన నాయుడు. అసలు నూతన నాయుడికి ఇంతటి ఫాలొయింగ్ ఎక్కడి నుండి వచ్చిందని అందరు ఆశ్చర్యపోతున్నారు.కాని నూతన నాయుడికి వచ్చిన ఓట్లు… అతనిని చూసి వేసినవి కావు అని కొందరు అభిప్రాయ పడుతున్నారు.బిగ్ బాస్ హోస్మెట్ అయిన కౌశల్కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలొయింగ్ ఉంది.అతనికి మద్దుతుగా కౌశల్ ఆర్మీ పేరిట పెద్ద సైన్యమే నడుస్తుంది.
హోస్మెట్స్లో పెద్దగా కౌశల్తో ఎవరు మాట్లాడటం లేదు.హోస్ నుండి బయటికి వచ్చిన నూతన నాయుడికి కౌశిల్కు మంచి స్నేహం ఉంది.దీంతో నూతన నాయుడిని బిగ్ బాస్ ఇంట్లోకి పంపిస్తే అతను కౌశల్కు మద్దతుగా ఉంటడని భావించిన కౌశల్ ఆర్మీ అతనికి భారీగా ఓట్లు పడేలా చేశారు.దీని కారణంగానే నూతన నాయుడు బిగ్ బాస్లోకి రీఎంట్రీ ఇవ్వగలిగాడని బహిరంగ రహస్యమే.కౌశల్ బాగా వ్యతిరేకించిన తేజస్వీకి మూడో స్థానం కూడా రాకుండా చేశారటా మన కౌశల్ ఆర్మీ.దీని బట్టి అర్థం అవుతుంది కౌశల్ కు బయట ఎంతటి మద్దతు లభిస్తుందో. ఈ వారం 11 కోట్లకు పైగా ఓట్లు వచ్చాయని నాని చెప్పడం జరిగింది.