Friday, April 26, 2024
- Advertisement -

తమన్నా సినిమా పైన “నో కామెంట్స్” అంటున్న దర్శకుడు

- Advertisement -

ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో కల్కి అనే సినిమా ప్రస్తుతం థియేటర్ల లో ఉంది. సినిమా కి అభిమానుల నుండి, ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుందని దర్శకుడు ఇటీవలే తెలిపారు. రాజశేఖర్ ప్రధాన పాత్ర లో ఈ సినిమా ప్రేక్షకుల ముందు వచ్చింది.

ఇలా కల్కి సినిమా గురించి ముచ్చటిస్తున్న ప్రశాంత్ వర్మ తో తాను గతం లో పని చేసిన క్వీన్ సినిమా రీమేక్ గురించి అడుగగా తెలివిగా సమాధానం ఇచ్చారు. ఏవో కారణాల వలన తమన్నా నటించిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది అన్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే దీని గురించి సినిమా ని పూర్తి చేసిన దర్శకుడిని అడిగితే ఈ కింది విధం గా సమాధానం ఇచ్చారు.

“నేను ఒక మూడో పర్సన్ లాగా ప్రాజెక్ట్ లో కి ఎంటర్ అయ్యాను. సినిమా ని మొదటి దర్శకుడు పూర్తి చేయకుండా బయటకు వెళితే నేను వెళ్ళి పూర్తి చేసాను. 31 రోజుల్లో షూటింగ్ మొత్తం కంప్లీట్ చేశాను. నేను సినిమా గురించిన వివరాలు చెప్పకూడదు. నేను వాటి గురించి చెప్పేందుకు కరెక్ట్ పర్సన్ ని కూడా కాదు. వీటి వలన నేను చిక్కుల్లో ఇరుక్కునే ప్రమాదం కూడా ఉంది.” అన్నాడు.

థట్ ఈజ్ మహాలక్ష్మి అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కించబడింది. మొదట నీలకంఠ ఈ సినిమా కి దర్శకుడి గా ఉన్నారు. తర్వాత తమన్నా తో విభేదాలు రావడం తో ఆయన ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -