Saturday, April 27, 2024
- Advertisement -

పరశురామ్ కి హీరో దొరికాడు

- Advertisement -

గీత గోవిందం లాంటి పెద్ద హిట్ కొట్టినా కానీ దర్శకుడు పరశురామ్ చాలా రోజులు ఖాళీ గా ఉన్నాడు. గీత గోవిందం విడుదల అయ్యాక చాలా మంది నిర్మాతలు తనని అప్రోచ్ అయినప్పటికీ పరశురామ్ మాత్రం ఓపిగ్గా ఉంటూ గీత ఆర్ట్స్ లో నే ఇంకో సినిమా చేయాలనే ఉదేశ్యం తో ఉన్నాడు. అయితే తాజా ఫిలిం నగర్ సమాచారం మేరకు ఈ దర్శకుడు తన తదుపరి చిత్రాన్ని నాని తో చేద్దాం అనే ఆలోచన తో ఉన్నాడట. నాని ని ఎలా అయినా ఒప్పించి సినిమా చేయాలనీ ప్రయత్నాలు చేస్తున్నాడు.

నాని ఆల్రెడీ రెండు సినిమాలు కమిట్ అయినప్పటికీ, గీత ఆర్ట్స్ తో రికమెండ్ చేయించి సినిమా చేయాలనీ భావిస్తున్నాడు పరశురామ్. ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కథ ని పరశురామ్ తయారు చేసుకున్నాడు అని తెలుస్తుంది. త్వరలో నే నాని ని పరశురామ్ కలవనున్నాడట. ప్రస్తుతం నాని మోహన్ కృష్ణ ఇంద్రగంటి తో ఒక సినిమా తో బిజీ గా ఉన్నట్టు తెలుస్తుంది. నాని-పరశురామ్ సినిమా కి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -