Saturday, April 27, 2024
- Advertisement -

ప్రొడక్షన్ వద్దనుకున్న స్టార్ హీరోయిన్

- Advertisement -

శర్వానంద్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘రణరంగం’ సినిమా తప్ప టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ చేతిలో తెలుగులో పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ లేవు. దీంతో ఇక కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీ కి గుడ్ బై చెప్పే సమయం వచ్చిందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ నేపద్యం లో కాజల్ అగర్వాల్ నిర్మాతగా మారే ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ‘అ!’ సినిమాని హిందీలో తానే నిర్మాతగా మారి రీమేక్ చేయాలని అనుకుంది. కానీ ఆ ఆలోచనలు మానుకుంది కాజల్. అంతేకాకుండా ‘పెళ్లిచూపులు’ ఫేమ్ రాజ్ కందుకూరి నిర్మాణ సంస్థలో ప్రొడ్యూసర్ గా పోదామనుకుని మళ్లీ ఆగిపోయింది.

తాజాగా కాజల్ అగర్వాల్ తండ్రి కూడా నిర్మాత అంటే బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయని సినిమా అంతా పూర్తయ్యే వరకు ఆగి ఆ తర్వాతే వచ్చిన డబ్బులు తీసుకోవాలని, హీరోయిన్ అయితే సినిమా షూటింగ్ పూర్తవగానే తన పని కూడా పూర్తి అయిపోయినట్టేనని చెప్పారట. అంతేకాకుండా ఒక వేళ కాజల్ నిర్మాత గా మారితే మిగతా నిర్మాతలందరూ కూడా కాజల్ ని హీరోయిన్ గా పెడితే రెమ్యూనరేషన్ కాకుండా సినిమాలో షేర్లు తీసుకోమని అడిగే అవకాశాలు ఉన్నాయని ఇదంతా లేకుండా హీరోయిన్ గానే తన కరియర్ చక్క పెట్టుకుంటే మంచిదని కాజల్ నిర్ణయించుకుందట. అందుకే నిర్మాతగా మారే ప్లాన్లు పక్కనపెట్టి హీరోయిన్ గానే తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది కాజల్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -