బాహుబలి సినిమా తరువాత హీరో ప్రభాస్ ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ర్ ప్రభాస్ పెళ్లి గురించి మీడియాలో ఎన్ని వార్తలు వస్తున్నా అవన్నీ పుకార్లే అని ఎప్పటికప్పుడు తేలిపోతోంది. ఓ ఇంటర్వూలో కృష్ణంరాజు భార్య శ్యామలా దేవికి ప్రభాస్ పెళ్లి ప్రశ్నే ఎదురయ్యింది. ప్రభాస్ కి భార్యగా రాబోయే అమ్మాయి గురించి శ్యామలాదేవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న సాహో
సినిమాతోనూ, జిల్
ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న మరో సినిమాతోనూ చాలా బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తిఅయిన తర్వాత ప్రభాస్ పెల్లిచేసుకుంటాడని భాస్ పెదనాన్న కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి క్లారిటీ ఇచ్చారు.
ప్రభాస్ పెళ్లిగురించి మీడియాలో వస్తున్న వార్తలను లైట్ తీసుకుంటామని తెలిపారు. భాస్ పెళ్లి గురించి మాకు కూడా తొందరగానే ఉందని…కాని ప్రభాస్ మాత్రం ఆ రెండు సినిమాలు పూర్తి అయ్యాక మాట్లాడుకుందాం అని అంటుంటాడని తెలిపింది. త్వరలోనే ఆ రెండు సినిమాలు పూర్తవుతున్నాయి. సాధ్యమైనంత త్వరలోనే పెళ్లి కబురు చెబుతామ`ని శ్యామలా దేవి చెప్పారు.