Friday, April 26, 2024
- Advertisement -

మ‌హేశ్ అభిమానుల‌కు శుభ‌వార్త‌..?

- Advertisement -

తెలుగు ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ ఉన్న వారి వెంట ప‌డుతుంటారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇది ఒక్క సినిమా ఇండ‌స్ట్రీకే పరిమితం కాలేదు. ప్ర‌తి ఇండ‌స్ట్రీలోను ఇలాగే స‌క్సెస్ ఉన్న వారి వెంట ప‌డ‌తారు. తాజాగా ఇలాంటి స్థితినే ఫేస్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. ఇత‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ హిట్లుగా నిలిచాయి. ప‌టాస్.సుప్రీమ్‌, రాజా ది గ్రేట్, ఇటీవ‌ల తీసిన ఎఫ్ 2 సినిమా కూడా మంచి విజ‌యాన్ని న‌మోదు చేసింది. దీంతో ఈ ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌డానికి స్టార్ హీరోలు సైతం ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. అనిల్ రావిపూడితో యంగ్ ఎన్టీఆర్ ఓ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా ఈ లిస్ట్‌లోకి సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు వ‌చ్చి చేరాడు.

అనిల్‌తో ఓ సినిమా చేద్దామ‌ని మ‌హేశ్ ఫిక్స్ అయ్యాడ‌ట‌. ఈ నేప‌థ్యంలోనే మ‌హేశ్ కోసం ఓ క‌థ‌ను సిద్ధం చేస్తున్నాడ‌ట అనిల్ రావిపూడి. ఇదే నిజం అయితే మ‌హేశ్‌ను మ‌ళ్లీ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన్‌లో చూడ‌వ‌చ్చు. మహేష్ బాబు ప్రస్తుతం తన 25 వ సినిమాగా తెరకెక్కుతున్న మహర్షి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డె న‌టిస్తోంది. ఈ సినిమా తరువాత సుకుమార్‌ డైరెక్షన్‌లో మరో సినిమాకు ఓకె చెప్పాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత అనిల్ సినిమా పట్టాలెక్కే ఛాన్స్‌ ఉంది. మ‌హేశ్ కోసం అర్జున్ రెడ్డి ద‌ర్శ‌కుడు సందీప్‌ రెడ్డి వంగా కూడా వెయిట్ చేస్తున్నాడు. మ‌రి వీరంద‌రితో మ‌హేశ్ ఎప్పుడు సినిమా చేస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -