Saturday, April 27, 2024
- Advertisement -

సూపర్ స్టార్ తో వంశీ పైడిపల్లి పుట్టినరోజు వేడుకలు

- Advertisement -

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్యనే ‘మహర్షి’ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నారు. సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ అందినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం ‘మహర్షి’ సినిమా పర్వాలేదనిపించింది. వంశీ పైడిపల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అయితే సినిమా పూర్తి అయిపోయినప్పటికీ మహేష్ బాబు ఇంకా వంశీ పైడిపల్లి ని ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉన్నారు. తాజాగా వంశీ పైడిపల్లి పుట్టినరోజు సందర్భంగా కూడా మహేష్ వంశీ పైడిపల్లి ని కలవడం జరిగింది. మహేష్ వంశీ కి కేక్ తినిపిస్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ ఫోటోలో వంశీ పైడిపల్లి భార్య మరియు పాప ఆద్య మాత్రమే కాక మహేష్ బాబు కూతురు సితార కూడా ఉంది. ఈ మధ్యనే సితార మరియు ఆద్య కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. మొదలుపెట్టిన కొద్దిసేపటికే ఆ చానల్ కి పదివేల మంది సబ్స్క్రైబర్లు వచ్చేశారు. ఇక సినిమాల పరంగా మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ఆర్మీ మేజర్ అవతారంలో కనిపించబోతున్నాడు మహేష్ బాబు. అనిల్ సుంకర మరియు దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -