Friday, April 26, 2024
- Advertisement -

ప్రముఖ దర్శకుడి కూతురితో యూట్యూబ్ ఛానల్ పెట్టిన మహేష్ బాబు

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీ లో పాపులారిటీ ఉన్న స్టార్ కిడ్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు నమ్రత ల పాప సితార పేరు ముందే ఉంటుంది. మహేష్ బాబు మరియు నమ్రత సోషల్ మీడియా ద్వారా తమ పిల్లలు గౌతమ్, సితార గురించి ఎప్పుడూ పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా మహేష్ బాబు కూతురు స్వయంగా కెమెరా ముందుకి వచ్చింది. తన స్నేహితురాలు ఆద్యతో కలిసి ఆమె యూట్యూబ్ ఛానల్ ను క్రియేట్ చేసింది. ఆద్య ఎవరో కాదు మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాకి దర్శకత్వం వహించిన వంశీ పైడిపల్లి కూతురు. ఆద్యతో కలిసి సితార ‘ఏ అండ్ ఎస్’ అని ఒక యూట్యూబ్ ఛానల్ ని ఈమధ్యనే క్రియేట్ చేశారు. తాజాగా దానిలో ఒక వీడియో ని కూడా పోస్ట్ చేశారు.

ఇంగ్లాండ్ కి వెకేషన్ కి వెళ్లినప్పుడు వారిద్దరూ కలిసారట. అక్కడ వీళ్ళిద్దరికీ ఈ ఐడియా వచ్చి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్లుగా చెప్పారు. 3 మార్కర్ చాలెంజ్ వీడియో ని పోస్ట్ చేసిన సీతారా మరియు ఆద్య అందులో ఒకరితో ఒకరు పోటీపడి బొమ్మల కి కలర్స్ వేశారు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక్క రోజు కూడా కాలేదు కానీ అప్పుడే సితార ఛానల్ కి ఈ ఛానల్ కి 23 వేల మంది ఈ సబ్స్క్రైబర్లు వచ్చేశారు. అంతేకాకుండా ఈ వీడియోని ఇప్పటికే 1700 మంది వరకు చూస్తారు. ఒకవైపు మహేష్ బాబు సినిమాలతో బిజీగా ఉంటే మరోవైపు తన తండ్రికి తగ్గ కూతురు సితార కూడా సొంతం తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -