తమిళ స్టార్ దర్శకుడు మణిరత్నం గత కొంతకాలంగా తన స్థాయికి తగ్గ సినిమాలు తీయలేకపోతున్నాడు.మణిరత్నంకు హిట్ వచ్చి చాలాకాలమే అయింది.ఓకే జానుతో ఫర్వాలేదనిపించుకున్నాడు.కాని వెంటనే చెలియా సినిమాతో మరో ప్లాప్ అందుకున్నాడు మణిరత్నం.ఈసారి హిట్ కొట్టలనే కసితో ‘చక్క చివంత వానమ్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.తెలుగులో ఈ సినిమాను నవాబ్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు.అరవింద్ స్వామి .. అరుణ్ విజయ్ .. శింబు .. విజయ్ సేతుపతి .. జ్యోతిక .. వంటి స్గార్స్ ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే విడుదల అయిన టీజర్కు మంచి స్పందన వచ్చింది.తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు చిత్ర యూనిట్.ప్రధాన పాత్రలన్నింటినీ కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. నలుగురు కథానాయకులు కూడా డిఫరెంట్ లు ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ ఈ ట్రైలర్ కొనసాగింది. ట్రైలర్ను చూస్తుంటే మనస్సుకి హత్తుకునే సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్స్కు కూడా పెద్ద పీట వేసినట్లు తెలుస్తుంది.ఇక ఈ సినిమాను ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.మరి ఈ సినిమా ఏ స్థాయి విజయన్ని అందుకుంటుందో చూడాలి.