యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరస హిట్లతో దూసుకుపోతున్నాడు.తాజాగా ఎన్టీఆర్ నటించిన ‘జైలవకుశకు అరుదైన గౌరవం దక్కింది.నార్త్ కొరియాలో జరిగే ‘బుచియాన్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిలిం ఫెస్టివల్’ లో రెండు రోజుల ప్రదర్శనకి గాను ‘జైలవకుశ’ సినిమాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శింపబడే ఏకైక తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. దర్శకుడు బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నివేదా థామస్, రాశిఖన్నా హీరోయిన్లుగా నటించారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం అభిమానులను ఆకట్టుకుంది. జై, లవ, కుశ అనే మూడు పాత్రల్లో ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు.ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను దసరాకు విడుదల చేయలని ప్లాన్ చేస్తున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు.హీరోయిన్లుగా పూజ హెగ్గె,ఇషా రెబ్బా నటిస్తున్నారు.