Friday, April 26, 2024
- Advertisement -

కీర్తి సురేష్ నటించిన ’పెంగ్విన్’ ట్రైలర్.. ఎలా ఉందంటే ?

- Advertisement -

‘మహానటి’ సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి సురేష్ తాజాగా నటించిన చిత్రం ‘పెంగ్విన్’. తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు నిర్మాణంలో కార్తికేయన్ సంతానం – కాల్ రామన్ – ఎస్.సోమసేగర్ – కళ్యాణ్ సుబ్రమణియన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు. తెలుగు తమిళ మలయాళ హిందీ భాషల్లో ఈ సినిమాని జూన్ 19న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ మొదలు పెట్టారు చిత్ర యూనిట్.

ఇటీవల హీరోయిన్స్ సమంత త్రిష తాప్సి మంజువారీయర్ చేతుల మీదుగా ‘పెంగ్విన్’ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ‘మీ అందరి కథల వెనుక ఓ అమ్మ కథ ఉంది. ఎందుకంటే మీ ప్రయాణం ప్రారంభించేది ఆమె నుంచే..’ అని టీజర్లో చూపించారు. ఈ క్రమంలో కొద్ది సేపటి క్రితం ఈ చిత్ర ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్ ని తెలుగులో హీరో నాని.. మలయాళంలో మోహన్ లాల్.. తమిళ్ లో ధనుష్ రిలీజ్ చేసారు. థ్రిల్లర్ నేపథ్యంలో ఉన్న ఈ ట్రైలర్ లో కొడుకును కోల్పోయి వెతుకులాట ప్రారంభించిన తల్లి పాత్రలో కీర్తి సురేష్ కనిపించింది. ట్రైలర్ చివరలో కనిపించే ఆ సైకో ఎవరనే ఆసక్తిని కలిగిస్తోంది.

కొడుకు కోసం తల్లి పడే వేదన.. కొడుకును దక్కించుకునేందుకు చేసే పోరాటం ఈ ట్రైలర్ లో ఉన్నాయి. సంతోష్ నారాయణ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ఆద్యంతం ఉత్కంఠగా ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రానికి కార్తీక్ ఫలని సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. అన్ని భాషల్లో ఈ సినిమా ప్రేక్షలను అలరిస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. మీరు కూడా ఈ ట్రైలర్ ను ఓ లుక్కేయండి.

రష్మీ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన శిల్పా చక్రవర్తి..!

హీరోయిన్ కళ్యాణి గుర్తుందా ? ఇప్పుడేం చేస్తుందంటే ?

ఫస్ట్ టైం శ్రీమతితో జబర్దస్త్ మహేష్ ఇలా..!

నిఖిల్ హీరోయిన్ అక్ష గుర్తుందా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -