నా పేరు సూర్య సినిమా షాక్ నుంచి కొలుకోవాడనికి బన్నికి చాలా సమయమే పట్టింది. ఈ సినిమా తరువాత చాలా కథలు విన్నప్పటికి అవి పెద్దగా నచ్చకపోవడంతో చాలాకాలం పాటు ఖాళీగా ఉన్నాడు బన్ని. ఆ తరువాత త్రివిక్రమ్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాను తన సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నెలలో మొదలుకానుంది. తాజాగా ఈ సినిమాలో హీరో్యిన్గా పూజా హెగ్డెను ఎంపిక చేశారని తెలుస్తోంది.
మొదట ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీని తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చినప్పటికి చివరికి పూజా హెగ్డెను తీసుకున్నారని తెలుస్తుంది. పూజా హెగ్డె గతంలో బన్నితో కలిసి దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా మరోసారి బన్నితో రొమాన్స్కు రెడీ అవుతోంది. అటు త్రివిక్రమ్తో కూడా పూజా హెగ్డె రెండో సినిమా ఇది. ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. దీంతోనే బన్ని సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డెను తీసుకున్నాడు త్రివిక్రమ్. దీనిపై త్వరలోనే అఫిషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది.