Friday, April 26, 2024
- Advertisement -

ప్రభాస్ సినిమా డైరెక్టర్ పై ఫ్యాన్స్ ఘరమ్ ఘరమ్ ..?

- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా ఆదిపురుష్ నుంచి నిన్న ఒక అప్ డేట్ వచ్చిన విషయం అందరికి తెలిసిందే.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా  350 కోట్ల భారీ బడ్జెట్టుతో నిర్మితమవుతుంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో  రామాయణం ఆధారంగా రూపొందే ఈ పౌరాణిక చిత్రం జనవరి నుంచి సెట్స్ కు వెళుతుంది. రెండు నెలల్లోనే షూటింగును పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే, వీఎఫ్ఎక్స్ పనులకి ఎక్కువ సమయం పడుతుందట.

ఇక రీసెంట్ గా వచ్చిన అప్ డేట్ పై ప్రభాస్ ఫాన్స్ నిరశాపడుతున్నారట.. గత కొన్ని రోజులుగా ప్రచారం అవుతున్న సైఫ్ ఆలీఖాన్ ఈ సినిమా లో విలన్ అన్న వార్తపై వారు నిరాశ చెందారట..ప్రభాస్‌కు సైఫ్ ఎంతమాత్రం దీటైన విలన్ కాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. హిందీ ప్రేక్షకులే ఈ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆరడుగుల రెండంగులాల ఎత్తుతో చాలా మ్యాన్లీగా కనిపిస్తాడు ప్రభాస్. ఆకారం విషయంలో అతడి ముందు సైఫ్ కచ్చితంగా తేలిపోతాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రావణాసురుడి పాత్ర అనగానే క్రూరంగా కనిపించే, రౌద్ర రసాన్ని బాగా పలికించగల, ఓ భారీకాయుడిని ఊహించుకుంటారు జనాలు. సైఫ్‌లో ఆ లక్షణాలు ఎవరికీ కనిపించడం లేదు. సైఫ్ నటుడిగా తనేంటో రుజువు చేసుకున్నా.. కొన్ని అద్భుతమైన పాత్రలు చేసి మెప్పించినా.. రావణాసురుడి పాత్రకు మాత్రం అతను సూట్ కాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

బాహుబలి సినిమా తో ఓ రేంజ్ స్టార్ అయిపోయిన ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమా లతో సెట్స్ మీద ఉన్నాడు.. ఒకటి రాధే శ్యామ్ కాగా మరొకటి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా.. మరొకటి బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్.  ఈ సినిమా తో హాలీవుడ్ స్టార్ గా ప్రభాస్ ఎదగడం ఖాయమంటున్నారు.. ఇక ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -