Saturday, April 27, 2024
- Advertisement -

నయన తార నా కాపురంను నాశనం చేసింది : ప్రభుదేవా భార్య

- Advertisement -

నయనతారకు టాలీవుడ్, కోలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఈమె ప్రస్తుతం కోలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఈమె రెమ్యునరేషన్ కూడా దాదాపుగా హీరోలతో సమానంగా ఉంటుంది. అయితే ఈమె అప్పట్లో ప్రభుదేవ తో ప్రేమాయణం నడిపిన విషయం తెలిసిందే. అయితే అప్పటికే ప్రభుదేవకి పెళ్లైన విషయం తెలిసిందే.

1995లో రమాలత్ అనే ముస్లిం అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు ప్రభుదేవా. ఇతని కోసం మతం కూడా మార్చుకుంది ఆమె. 15 ఏళ్ల పాటు హాయిగా ఉన్న వీరి మధ్య నయనతార వచ్చింది. దాంతో వీళ్ల మధ్య గొడవలు మొదలు అయ్యాయి. అదే టైములో ప్రభుదేవా కొడుకు కూడా మరణించాడు. దాంతో గొడవలు మరింతగా పెరిగాయి. నయనతారను పెళ్లి చేసుకునేందుకు కూడా ప్రభుదేవా రెడీ అయ్యాడు. దాంతో 2011 లో రమాలత్ కు విడాకులు ఇచ్చేసాడు ప్రభుదేవా.

ఆమెకు భారీగా ఆస్తులు కూడా ఇచ్చాడని అప్పట్లో టాక్ నడిచింది. తరువాత నయన్, ప్రభు దేవా కూడా విడిపోయారు. అయినప్పటికీ ఇంకా రమాలత్ మాత్రం ఇంకా నయన్ పై ఘాటు కామెంట్స్ చేస్తూనే ఉంది. ”నయనతార వల్లే నా లైఫ్.. కాపురం నాశనమైపోయింది. నా జీవితం రోడ్డున పడింది. నా భర్తను నాకు కాకుండా చేసింది. కచ్చితంగా ఆమెకు ఆ దేవుడు శిక్షిస్తాడు. పెళ్లైన మగళ్ళ వైపు చూసే ఇలాంటి ఆడవాళ్ళను కఠినంగా శిక్షించాలి. నేను అంటే ప్రాణం ఇచ్చే నా భర్తను నాకు కాకుండా చేసింది నయనతార. 15 ఏళ్లు నా భర్త .. నన్ను దేవతలా చూసుకున్నాడు. ఏం మాయ చేసిందో ఏమో నా కాకుండా చేసింది’ ఆమె మండిపడింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -