Saturday, April 27, 2024
- Advertisement -

మెగా సెల్ఫీ అదిరింది..!

- Advertisement -

మెగా హీరోలంద‌రు ఒక‌చోట క‌లిస్తే అభిమానుల‌కు పండ‌గే. ఇండ‌స్ట్రీలో ఎవ్వ‌రికి లేని ఫ్యాన్ బేస్ మెగా ఫ్యామిలీకి ఉంది. మెగా హీరోల మీద అభిమానులు త‌మ ప్రేమ‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చాటుకుంటునే ఉన్నారు. తాజాగా మెగా హీరోలిద్ద‌రు క‌లిసి ఓ చోట చేరారు. మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌లు క‌లిసి ఓ ఫ్రేమ్‌లో క‌నిపించారు. అన్నదమ్ములిద్దరూ ఓ మంచి ట్రిప్ వేశారు. రామ్ చరణ్ – వరుణ్ తేజ్ ఇద్దరు కలిసి ఇచ్చిన సెల్ఫీ ఇప్పుడు మెగా అభిమానులను తెగ ఆకర్షిస్తోంది.

ఈ ఫోటోలో ఇద్ద‌రు హీరోలు డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో RRRలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీత‌రామ‌రాజుగా క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమాలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కోమ‌రం భీంగా క‌నిపించునున్నాడు. ఇక వ‌రుణ్ తేజ్ విష‌యానికి వ‌స్తే హరీష్ శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో వాల్మీ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. వీరిద్ద‌రు ఇలా రెండు డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపించ‌డంతో మెగా అభిమానులు సంబంరాలు చేసుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -