Saturday, April 27, 2024
- Advertisement -

15 ఏళ్ల తర్వాత కలబోతున్న రమ్యకృష్ణ, కృష్ణవంశీ..!

- Advertisement -

డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ’బాహుబలి’ సినిమా ఎంత పెద్ద విజయం సాంధించిందో అందులో శివగామిగా నటించిన రమ్యకృష్ణకు కూడా అంతే పేరు వచ్చింది. ఇక రాజమౌళి కూడా పలు సందర్భాల్లో అన్ని క్యారెక్టర్ల కంటే శివగామి క్యారెక్టర్ ఎక్కువ ఇష్టమని చెప్పారు. రమ్యకృష్ణ ఏ పాత్ర చేసిన అందులో ఒదిగిపోయి నటిస్తోంది. అందుకే ఆమె కోసం పాత్రలు వెతుకుంటూ వస్తాయి.

కానీ ఆమె భర్త క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ కెరీర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. కృష్ణ వంశీ సూపర్ హిట్ మూవీ తీసి దాదాపుగా 12 సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత చాలా సినిమాలు చేసినప్పటికి అవేవి పెద్దగా అభిమానులను ఆకట్టుకోలేదు. 2004లో కృష్ణవంశీ తీసిన ‘శ్రీ ఆంజనేయం’ చిత్రంలో రమ్యకృష్ణ నాటించారు. ఆ తర్వాత ఆమె భర్త తీసిన ఏ సినిమాలోనూ ఆమె నటించలేదు.

అంతేకాకుండా వీరిద్దరి మధ్య మనస్పర్దలు వచ్చాయని.. విడిపోతున్నారని కూడా సోషల్ మీడియాలో రకరకల వార్తలు వచ్చాయి. ఇంతకాలం తనకు నచ్చినట్లు తన కెరీర్ గురించి ఆలోచించి పాత్రలు చేసిన రమ్య.. ఇప్పుడు భర్తకు కూడా ఒక్క హిట్ సినిమా రావాలని కోరుకుంటుంది. అంతేకాకుండా కృష్ణవంశీ త్వరలో తీయబోయే చిత్రంలో ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో రమ్యకృష్ణ కనిపించనుందట. మరు రమ్యకృష్ణ నటిస్తుంది కాబట్టి ఈ సారైన కృష్ణవంశీకి కలిసి వస్తుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -