హీరోయిన్ శృతి హాసన్ లోక నాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీకి వచ్చింది. తక్కువ కాలంలోనే తండ్రికి తగ్గ కూతురుగా పేరు సంపాదించుకుంది. శృతి హాసన్కు తొలి హిట్ ఇచ్చింది మాత్రం తెలుగు ఇండస్ట్రీనే. పవన్ కల్యాణ్తో నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో తొలి హిట్ అందుకుంది శృతి హాసన్. తెలుగులో మహేశ్ బాబు,అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, నాగచైతన్య వంటి హీరోలతో నటించింది హిట్లను తన ఖాతాలో వేసుకుంది. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది శృతి హాసన్.
విదేశీ బోయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సలే ప్రేమలో మునిగి తెలుతోంది శృతి హాసన్. దీని కారణంగా సినిమాలకు దూరంగా ఉంటుందట శృతి హాసన్. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కాని అలా జరగలేదు. శృతి హాసన్ తిరిగి సినిమాల్లో నటిస్తోంది. అయితే మైఖేల్ కోర్సలేతో సహజీవనం చేస్తున్న కారణంగానే ఆమె పెళ్లిని వాయిదా వేసిందని తెలుస్తోంది. చాలాకాలం నుంచి వీరిద్దరు సహజీవనం చేస్తున్నారని వినికిడి. వ్యక్తిగత జీవితంలో శృతి తనకు నచ్చినట్లు జీవిస్తోంది. ఆమె ప్రస్తుతం తమిళంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
- Advertisement -
శృతిహాససన్ అతనితో సహజీవనం చేస్తోందా..?
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -