‘ఝుమ్మంది నాదం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ తాప్సీ పన్ను. ఆ తర్వాత చిన్న చిన్న సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న తాప్సీ ఇప్పుడు బాలీవుడ్కు వెళ్లిపోయింది. అక్కడే సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. గోపిచంద్తో ‘సాహసం’, ‘ఆనందో బ్రహ్మ’ తెలుగులో తాప్సీ చివరి సినిమాలు. ఇప్పుడు ఆ హీరోయిన్ ఓ యువకుడి రాసిన ప్రేమలేఖకు ఫిదా అయ్యింది. ఈ విషయాన్ని తాప్సీనే సోషల్ మీడియాలో పంచుకుంది.
ఈ సొట్టబుగ్గల సుందరికి ఓ యువకుడు రాసిన ప్రేమలేఖకు పడిపోయింది. ‘మందు ముట్టనూ.. మాంసం ముట్టనూ! అన్నింటికంటే ముఖ్యంగా నేను వర్జీన్ను. నీ మీద నాకు ఉన్న ప్రేమను నిరూపించేందుకు నార్కొటిక్ పరీక్షకైనా.. లై డిటెక్టర్ పరీక్షకైనా నేను సిద్ధమే. నా మెదడును పూర్తిగా పరీక్షించడం మాత్రం మరవద్దు’ అంటూ ఓ అభిమాని రాసిన ప్రేమలేఖ తాప్సీ ఈ మెయిల్కు పంపించాడు.
ఈ లేఖ తాప్సీకి బాగా నచ్చడంతో తన అకౌంట్లో షేర్ చేసింది. ‘బెస్ట్ ప్రపోజల్ ఎవర్… వెజిటేరియన్ లవ్ ఇంతకు మించి జీవితంలో ఇంకేం కావాలి’ అంటూ తాప్సీ చెప్పుకుంటూ పంచుకుంది.తాప్సీ ఇటీవల బాలీవుడ్లో ‘జుడ్వా- 2’ సినిమా చేసింది.
Bas ab life mein aur kya chahiye ! #BestProposalever #VegetarianLove pic.twitter.com/bv0gqywOmC
— taapsee pannu (@taapsee) March 21, 2018