Friday, April 26, 2024
- Advertisement -

ఇదే నా చివ‌రి చిత్రం – రాజ‌మౌళి

- Advertisement -

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా న‌టిస్తున్న చిత్రం RRR . తాజాగా ఈ సినిమా గురించి మీడియా స‌మావేశం పెట్టారు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఈ సినిమా క‌థ‌ను మీడియాతో పంచుకున్నారు. ఈ సినిమా క‌థ 1920 సంవత్సరంలో జరిగిన కథ ఇదని చెప్పారు. దాదాపు 300 కోట్ల భారీ బ‌డ్టెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నామ‌ని తెలిపారు రాజ‌మౌళి. సినిమా క‌థ‌ను కొమరం బీమ్, అల్లూరి సీతారామరాజు జీవిత క‌థ‌ల ఆధారంగా అల్లుకున్న కథతో ఈ సినిమా చేస్తున్నానని ప్ర‌క‌టించారు రాజ‌మౌళి.

ఈ సంద‌ర్భంగా ఈ సినిమాలో హీరోయిన్స్‌గా ఎవ‌రు న‌టిస్తున్నారో కూడా చెప్పేశారు రాజ‌మౌళి. ఈ సినిమాలో బాలీవుడ్‌ హీరోయిన్ ఆలియా భట్, హాలీవుడ్ హీరోయిన్‌డైజీ అడ్గార్జియోన్స్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. వీరిని సినిమాలో హీరోయిన్స్‌గా తీసుకుంటున్నార‌ని అధికారికంగా ప్ర‌క‌టించాడు రాజ‌మౌళి. రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న అలియా భట్ న‌టిస్తుండ‌గా, డైజీ అడ్గార్జియోన్స్ ఎన్టీఆర్ ప‌క్క‌న హీరోయిన్‌గా న‌టించ‌నుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్ విల‌న్‌గా న‌టించ‌నున్నాడు. ఈ సినిమాలో ఆలియా భ‌ట్ సీత పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని తెలిపాడు రాజ‌మౌళి. బ‌హుశ ఇదే నా చివ‌రి చిత్రం కావచ్చు అని తెలిపి అంద‌రికి షాకిచ్చాడు రాజ‌మౌళి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -