Saturday, April 27, 2024
- Advertisement -

బిగ్ బాస్ కి వీడ్కోలు చెప్పనున్న యాంకర్

- Advertisement -

బిగ్ బాస్ మూడవ సీజన్ 2 వారాలు పూర్తి చేసుకోబోతోంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షో టిఆర్పి రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొదటి వారం 15 మంది కాంటెస్టెంట్ ల నుంచి హేమ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వారం ఎనిమిది మంది నామినేషన్లు లోకి వచ్చారు. హిమజా, శ్రీముఖి, జాఫర్, వరుణ్ సందేశ్, పునర్నవి, వితికా, మహేష్, రాహుల్ ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన ఇంటి సభ్యులు. అయితే ఇవాళ జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున ముగ్గురు సేఫ్ జోన్ లో ఉన్నట్లుగా ప్రకటించేశారు.

వారు మహేష్, శ్రీముఖి మరియు హిమజా. డేంజర్ జోన్ లో ఉన్న ఐదుగురు ఇంటి సభ్యుల నుంచి ఆదివారం ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ వారం జాఫర్ బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అవ్వబోతున్నట్టు సమాచారం అందుతోంది. ఈ వారం మొత్తం ఎపిసోడ్లలో తనకు బిగ్ బాస్ ఇంట్లో ఉండాలి అని అనిపించడం లేదని, ఎలిమినేట్ అవ్వాలనిపిస్తోందని పలుసార్లు అన్న జాఫర్ నిజంగానే రేపు బిగ్ బాస్ ఇంటి నుండి వెళ్లిపోబోతున్నారు. మరోవైపు తమన్నా సింహాద్రి బిగ్ బాస్ లో హౌస్ లోకి వైల్డ్ కార్డ్ గా ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. ఈ వారం వరుణ్ సందేశ్ బిగ్బాస్ ఇంటి మొదటి కెప్టెన్ గా ఎంపికయ్యాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -