Friday, April 26, 2024
- Advertisement -

సరికొత్త అవతారంలో మెప్పించనున్న మెగా హీరో

- Advertisement -

కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ముందుకు దూసుకుపోతున్న యువ హీరో వరుణ్ తేజ్ ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. తమిళంలో సూపర్హిట్ అయిన ‘జిగర్తండా’ సినిమాకి రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో అధర్వ మురళి మరియు పూజా హెగ్డే లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందింది. తాజాగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

కేవలం నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ లుక్ హైలైట్ గా మారబోతుంది అని టీచరు చూస్తేనే అర్థమవుతుంది. ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటున్న ఈ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తోంది అనటం అతిశయోక్తి కాదు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -