ప్రస్తుతం బయోపిక్ సినిమాలతో పాటు మల్టీస్టారర్ల సినిమాల హవా ఊపందుకొంటోంది. ఇప్పటికే జక్కన్న ఎన్టీఆర్, రామ్చరణ్లతో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించిం అఫిషియల్గా ప్రకటించారు. ఇప్పుడు వెంకటేష్, నాగ్ చైతన్య కలసి మరో మల్టీ స్టారర్ మూవీ రాబోతోంది.
వెంకటేశ్ .. నాగచైతన్య నిజ జీవితంలో మేనమామ .. మేనల్లుడు. ఇదే బంధంతో ఇంతకముందు ప్రేమమ్’ సినిమాలో కనిపించారు. అదికూడా వెంకటేష్ కొంత సేపు మాత్రమే కనిపిస్తాడు. కానీ తాజా చిత్రంలో చైతూకి మేనమామగా పూర్తి స్థాయి పాత్రలో కనిపించనున్నారు.
వెంకటేశ్ .. నాగ చైతన్య హీరోలుగా దర్శకుడు బాబీ ఒక మల్టీ స్టారర్ ను చేయనున్నాడు. దీనికి సంబంధించి పనులు జరుగుతున్నాయి. ‘జై లవకుశ’ సినిమాతో హిట్ కొట్టిన ఈ దర్శకుడు, ఆ తరువాత చేయనున్న సినిమా ఇదే. రీసెంట్ గా ఆయన చైతూ .. వెంకీలకు కథను వినిపించి ఓకే అనిపించుకున్నాడని సమాచారం.
మేనమామ – మేనల్లుడి పాత్రలు నచ్చడం వల్లనే వాళ్లు ఆసక్తిని చూపుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం తేజ సినిమాతో వెంకటేశ్, చందూ మొండేటి .. మారుతి సినిమాలతో చైతూ బిజీగా వున్నారు. ఆ తరువాతనే బాబీ ప్రాజెక్టు పట్టాలెక్కవచ్చని చెప్పుకుంటున్నారు.