టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు సినిమాను అప్పటి స్టార్ హీరోయిన్ విజయశాంతి రిజెక్ట్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…మహేశ్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు వంశిపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరకుంది. ఈ సినిమా మహేశ్ కెరీర్లో 25వ సినిమా కావడంతో చాలా ప్రతీష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేశ్కు జోడిగా పూజా హోగ్డె నటిస్తోంది. రెండు పాటల మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో వెంటనే తదుపరి సినిమాను లైన్లో పెట్టాడు మహేశ్.
ఎఫ్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన తరువాత సినిమాను చేస్తున్నాడు మహేశ్ బాబు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర లేడీ సూపర్స్టార్ విజయశాంతిని సంప్రదించారట. అయితే ఆమె ఈ ఆఫర్ను సన్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. నేను ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నానని , రాజకీయాలు తప్ప సినిమాల్లో నటించే అవకాశం కాని , ఉద్దేశం కాని తనకు లేదని తెలిపి మహేశ్ సినిమాను రిజెక్ట్ చేసిందట విజయశాంతి. దీంతో ఆమె స్థానంలో మరో సీనియర్ భామను వెతికే పనిలో పడ్డాడట అనిల్ రావిపూడి.