బిగ్బాస్ రెండో సీజన్ శుక్రవారం జరిగే ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు బిగ్బాస్ టీం.ఈ ఎపిసోడ్లో షో నుంచి ఎలిమినేట్ అయిన తోటి ఇంటి సభ్యులు తిరిగి బిగ్బాస్ హౌస్లో సందడి చేశారు.లాస్ట్ వీక్ ఎలిమినేషన్ అయిన రోల్ రైడాతో పాటు అమీత్,తేజస్వీ,దీప్తి సునైనాలు బిగ్బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి, హౌస్మెట్స్కు షాక్ ఇచ్చారు.సడన్గా ఎంట్రీ ఇచ్చిన వీళ్లను చూసి షాక్ గురైయ్యారు కంటెస్టెంట్లు.ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికి షో నుంచి ఎలిమినేట్ అయిన నూతన్ నాయుడు,శ్యామల,భానుశ్రీ,నందిని సంజనాలు మాత్రం ఈ ఎపిసోడ్కు మాత్రం రాలేదు.
వీరు ఎందుకు రాలేదో అని అనుమానం అందరిలోను ఉంది.అయితే వీరు రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని తెలుస్తుంది.షో నుంచి ఎలిమినేట్ అయిన సభ్యులతో సడన్గా ఎపిసోగ్ ప్లాన్ చేయడంతో వీరికి రావడానికి కుదర్లేదని సమాచారం.నూతన్ నాయుడు తన సొంత ఊరైన వైజాగ్లో ఉండటంతో రావడానికి సమయం లేకపోవడం వల్లే రాలేదని తెలుస్తుంది. పైగా ఇప్పటికే నేను చాలాసార్లు బిగ్బాస్ ఇంట్లోకి రీఎంట్రీలు ఇచ్చాననే భావనతో ఉన్న నూతన్ నాయుడు,మళ్లీ రాకపోవడమే మంచిదని భావించి రాలేదని సమాచారం. యాంకర్ శ్యామల కూడా పలు సినిమాలకు సైన్ చేయడంతో పాటు,యాంకరింగ్లో బిజీగా ఉందని తెలుస్తుంది.
ఇక భాను శ్రీ బిగ్బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తరువాత పలు టీవీ షోలకి యాంకర్గా చేస్తుందని ,వాటి వల్లే భాను శ్రీ ఈ ఎపిసోడ్కి రాలేనని తెలిపిందట.ఇక నందిని విషయానికి వస్తే తాను ఓ సినిమా షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల రావడం కుదరదని తెలిపిందని సమాచారం.సంజన మాత్రం హైదరాబాద్లోనే ఉండి రానని చెప్పిందట.వీరిందరు అందుబాటులో లేకపోవడం వల్లే ఈ రోజు(శుక్రవారం)జరిగే ఎపిసోడ్కు రావడం లేదని మాత్రం తెలుస్తుంది.