బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ తన చెల్లెలుని సినిమా ఇండస్ట్రీకి పరిచియం చేయడానికి రెడీ అవుతుంది.మోడల్ తన కెరీర్ను ప్రారంభించిన దిశా తరువాత బాలీవుడ్లో హీరోయిన్గా అవకాశాలు రావడం,బిజీగా మారడం అన్ని చకా చకా జరిగాయి.దిశా పటానీ అందాలను గుర్తించిన తెలుగు దర్శకుడు పూరి జగన్నాధ్ లోఫర్ సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇచ్చాడు.పాపం సినిమా ఫెయిల్ కావడంతో తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.
బాలీవుడ్ వరస సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉంది.తనలాగే తన చెల్లెలను కూడా సినిమా ఇండస్ట్రీకి తీసుకురావలని ప్రయత్నలు చేస్తుంది దిశ.దీనిలొ భాగంగానే ఆమె చెల్లెలతో ఓ ఫోటో షూట్ చేయించిదట దిశ పటానీ.తాజాగా ఈ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది.అక్కతో పోలిస్తే చెల్లెలు కాస్తా డల్గానే కనిపిస్తుంది.మరి ఈ అందంతో ఇండస్ట్రీలో రాణించాలి అంటే కొంచెం కష్టమే.