Saturday, April 27, 2024
- Advertisement -

వామ్మో.. ఇదేమి మోసం బెల్లంకొండ…

- Advertisement -

సినిమా విజయం పరాజయం తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలని చేసుకుంటూ పోతున్న నటుల్లో ఒకరు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇటీవలే సీత అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో ఆ సినిమా తో ప్రేక్షకులని మెప్పించే ప్రయత్నం చేయలేకపోయారు. అయితే ఆ సినిమా పరాజయాన్ని మర్చిపోవాలనే ఉదేశ్యం తో తన కొత్త చిత్రం రాక్షసుడు టీజర్ ని నేడు ప్రేక్షకుల ముందుకు దించారు. టీజర్ బాగానే ఉంది కానీ ఈ టీజర్ వెనుక చిత్ర యూనిట్ ప్రేక్షకుల ని చేసిన మోసం ఒకటి దాగుంది. అదేంటీ అని తెలుసుకుంటే మీరు షాక్ అవ్వక తప్పదు.

రట్సాసన్ అనే తమిళ చిత్రానికి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రం ఒక సిటీ లో జరుగుతున్న సైకో కిల్లింగ్స్ మీద ఆధార పది ఉంటుంది. తమిళం లో పెద్ద విజయం సాధించిన ఈ చిత్రానికి రీమేక్ రైట్స్ సాధించి అతి తక్కువ రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు దర్శక నిర్మాతలు. అంత తక్కువ రోజుల్లో షూటింగ్ ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు కూడా.

అయితే అసలు విషయం ఏంటి అంటే ఈ సినిమా లో సింహ భాగం ఒరిజినల్ లో వాడిన షాట్స్ ని అంతే ఉంచేశారు. అదే యాక్టర్లని ఈ సినిమా లో నటింపజేశారు. అయితే హీరో అవసరం లేని సీన్లు అన్ని డబ్బింగ్ చేసినట్టు తెలుస్తుంది. కొత్త ఆర్టిస్ట్స్ కావాల్సిన సీన్లు మట్టుకు షూట్ చేశారు అని సమాచారం. దీని వలన టైం మరియు డబ్బులు మిగులుతాయి కానీ తమిళ ఫ్లేవర్ అంతే ఉంది అంటే మాత్రం చిత్ర యూనిట్ కి కష్టమే అవుతుంది.

ఏది ఏమైనా ఈ సినిమా తో అయినా విజయం సాధించాలనే బెల్లంకొండ తాపత్రయాన్ని మాత్రం ఒప్పుకోకుండా ఉండలేము.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -