యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అరవింద సమేత సినిమాలో బిజీగా ఉన్నాడు.తండ్రి హరికృష్ణ మరణంతో సినిమా వాయిదా పడుతుందని వార్తలు వచ్చినప్పటికి తన వల్ల సినిమా ఆలస్యం కాకుడదని భావించిన ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా షూటింగ్లో పాల్గొని శరవేగంగా సినిమాను పూర్తి చేస్తున్నాడు.మొదట ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించాలని భావించినప్పటికి హరికృష్ణ మరణంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ను రద్దు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
దీనిపై పూర్తి స్పష్టత రావల్సి ఉంది.మాటల మంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో ఎన్టీఆర్కు జోడిగా పూజా హెగ్డె,ఈషా రెబ్బాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఎన్టీఆర్ ఈ సినిమాలో డబల్ రోల్ కనిపించనున్నాడని సమాచారం.అరవింద సమేత సినిమాను దసరాకు విడుదల చేయనున్నారు.ఇప్పటికే విడుదల అయిన టీజర్కు మంచి స్పందన వచ్చింది.