- Advertisement -
ఉదయ్ కిరణ్ బయోపిక్కు రంగం సిద్ధం చేస్తున్నాడు దర్శకుడు తేజ.అసలు ఉదయ్ కిరణ్ని ఇండస్ట్రీకి పరిచియం చేసిందే తేజ.’చిత్రం’ సినిమా ద్వారా ఉదయ్ కిరణ్ని ఇండస్ట్రీకి పరిచియం అయ్యాడు.ఈ సినిమా తరువాత ఉదయ్ కిరణ్కు ‘నువ్వు నేను’ సినిమాతో మరో సినిమా హిట్ ఇచ్చాడు దర్శకుడు తేజ. అయితే ఉదయ్ కిరణ్ బయోపిక్లో చిరంజీవి పాత్ర కోసం హీరో రాజశేఖర్ను దర్శకుడు తేజ కలిశాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే దీనిపై స్పందించిన తేజ రాజశేఖర్ను కలిసిన మాట వాస్తవమే కాని అది ఉదయ్ కిరణ్ బయోపిక్ సినిమా కోసం కాదని చెప్పాడు. కాని ఇండస్ట్రీ వర్గాలు మాత్రం సినిమా కోసమే వీరిద్దరు కలిశారని చెబుతున్నారు. అందుకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని అనుకుంటున్నారు.